ETV Bharat / state

బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

author img

By

Published : May 10, 2020, 8:02 PM IST

తమకు కనీస వేతనంగా నెలకు రూ.20వేలు చెల్లించాలని విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటల పాటు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బందికి ​కనీస వేతనంగా నెలకు రూ.20 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రెడ్డి డిమాండ్ చేశారు. పీహెచ్ వర్కర్లకు వేతనాలు కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి:

విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.