ETV Bharat / state

విద్యుత్ బిల్లుల పెంపు.. అపోహే: ఎమ్మెల్యే రాజన్నదొర

author img

By

Published : May 17, 2020, 11:00 AM IST

ముఖ్యమంత్రి జగన్.. ప్రజలకు ఎలాంటి కష్టం కలిగించరని ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు. విద్యుత్ బిల్లుల పెంపు అన్నది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు.

mla rajanna dora
అధిక కరెంట్​ బిల్లులపై ఎమ్మెల్యే రాజన్నదొర

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మక్కువ, పాచిపెంట, పాలూరు, మండలాల్లో కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని అంతా అపోహ పడుతున్నారని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. బిల్లు ఎక్కువగా వచ్చినందుకు గల కారణాలను.. అధికారులు ప్రజలకు వివరించాలని చెప్పారు. లాక్​డౌన్​ కారణంగా అందరూ ఇంట్లో ఉండి అధికంగా ఫ్యాన్లు, టీవీ, లైట్స్, వాటడమే కాక.. వేసవి కావడం కరెంటు వినియోగం పెరగడానికి కారణంగా చెప్పారు.

90 యూనిట్లు దాటితే శ్లాబ్ రేటు మారడం వలన కూడా కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని అపోహ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు వాస్తవాలను సరిగా చెప్పలేక పోవడం వల్లే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చింది అని.. అంతా అపోహ పడ్డానని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు.

ఇవీ చూడండి:

'చెప్పినదానికంటే.. రైతులకు ఎక్కువగా ఇస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.