ETV Bharat / state

విజయనగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

author img

By

Published : Feb 16, 2020, 5:03 AM IST

huge amount of Gold_Silver_Recovery from thieves by vizianagaram police
నిఘా: నలుగురు అరెస్టు.. రూ. 10.50 లక్షల ఆభరాణాలు స్వాధీనం

విజయనగరం జిల్లా కురుపాం, పార్వతీపురంలోని దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు, 3 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10.50 లక్షలు ఉంటుందని ఎస్పీ రాజకుమారి తెలిపారు.

ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతోన్న దొంగల ముఠా అరెస్టు

ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల్లోని గృహాల్లో దొంగతనాలకు పాల్పడుతోన్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను విజయనగరం జిల్లా పోలీసులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10.50 లక్షలు విలువైన 200 గ్రాముల బంగారు, 3 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. జిల్లాలోని కురుపాం, పార్వతీపురంలో ఒకే తరహాలో జరిగిన దోపిడీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దర్యాప్తులో భాగంగా మొదట లోకేష్ అనే వ్యక్తిని విచారించగా... ముఠాకు సంబంధించి మిగిలిన సభ్యుల ఆచూకీ లభించిందన్నారు. ముఠాలో అధిక శాతం ఒడిశాకు చెందిన సభ్యులుండగా.. మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

ఒకరితో ప్రేమ... మరొకరితో పెళ్లి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.