Justice Krishnamohan: పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

author img

By

Published : Sep 17, 2022, 7:00 PM IST

Justice Krishnamohan

Justice Krishnamohan: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి జాతరకు అంకురార్పణ జరిగింది. జాతర సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ కృష్ణమోహన్​ దంపతులు.. అమ్మవారిని దర్శించుకున్నారు.

Justice Krishnamohan: హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బి.కృష్ణ‌మోహ‌న్ దంప‌తులు... విజ‌య‌న‌గ‌రం పైడిత‌ల్లి అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య ఈవో కిషోర్ కుమార్ ఆధ్వ‌ర్యంలో పూజారులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆల‌యం వ‌ద్ద న్యాయ‌మూర్తిని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. పైడితల్లి సిరిమాను ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణగా వేసిన‌ పందిరి రాట‌ను ఇరువురూ సంద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సాయి క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.