గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్, ఐఐఎఫ్ఎస్ ఆధ్వర్యంలో రక్త దానం నిర్వహించారు. 68 మంది యువతీ యువకులు రక్త దానం చేశారు. తలసేమియా, రక్తహీనత బాధితులను కాపాడే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు సేవ్ యువర్ మదర్ ల్యాండ్ వ్యవస్థాపకులు కిషోర్ తెలిపారు.
ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై జయంతి హాజరయ్యారు. యువత తలచుకుంటే ఏదైనా చేయగలదని, చదువుతో పాటు ప్రతి ఒక్కరి లో సేవాగుణం అలవర్చుకోవాలి అని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహంతి శ్రీను, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: