ETV Bharat / state

పూసపాటిరేగలో రక్తదాన శిబిరం

author img

By

Published : Jan 27, 2021, 12:37 PM IST

పూసపాటిరేగలో రక్తదాన శిబిరం
పూసపాటిరేగలో రక్తదాన శిబిరం

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 68 మంది యువకులు రక్తదానం చేశారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఎన్​వీఎన్ బ్లడ్ బ్యాంక్, ఐఐఎఫ్​ఎస్ ఆధ్వర్యంలో రక్త దానం నిర్వహించారు. 68 మంది యువతీ యువకులు రక్త దానం చేశారు. తలసేమియా, రక్తహీనత బాధితులను కాపాడే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు సేవ్ యువర్ మదర్ ల్యాండ్ వ్యవస్థాపకులు కిషోర్ తెలిపారు.

ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై జయంతి హాజరయ్యారు. యువత తలచుకుంటే ఏదైనా చేయగలదని, చదువుతో పాటు ప్రతి ఒక్కరి లో సేవాగుణం అలవర్చుకోవాలి అని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహంతి శ్రీను, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏ అర్హతలుండాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.