ETV Bharat / state

తెలంగాణ ఎంసెట్: ​విజయనగరం విద్యార్థికి మొదటి ర్యాంక్

author img

By

Published : Oct 6, 2020, 11:30 PM IST

తెలంగాణ ఎంసెట్​ ఇంజినీరింగ్ ఫలితాలను ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన సాయితేజ్​ మొదటి ర్యాంక్ సాధించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని వెల్లడించారు.

తెలంగాణ ఎంసెట్​ ఫలితాల్లో విజయనగరం విద్యార్థికి మొదటి ర్యాంక్
తెలంగాణ ఎంసెట్​ ఫలితాల్లో విజయనగరం విద్యార్థికి మొదటి ర్యాంక్

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో విజయనగరం విద్యార్థి సాయితేజ్ ప్రతిభ చాటాడు. మొదటి స్థానంలో నిలిచాడు. తమ కుమారుడికి మొదటి ర్యాంకు రావడంపై సాయితేజ్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సాఫ్ట్​వేర్ సైన్స్‌లో ఇంజినీర్ కావాలని ఉందని ముంబై ఐఐటీలో సీఎస్​ఈ చదవాలని ఉందని మెుదటి ర్యాంకర్‌ సాయితేజ్‌ తెలిపారు.

నారాయణ కళాశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో మంచి ఫలితం సాధించానని పేర్కొన్నారు. అతని తల్లిదండ్రులు విజయనగరంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

తెలంగాణ ఎంసెట్​ ఫలితాల్లో విజయనగరం విద్యార్థికి మొదటి ర్యాంక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.