ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Dec 8, 2022, 5:01 PM IST

.

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS

  • మరోసారి గుజరాత్​ సీఎంగా భూపేంద్ర పటేల్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
    భూపేంద్ర పటేల్​ మరోసారి గుజరాత్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హిమాచల్​లో కాంగ్రెస్​ జాక్​పాట్.. మార్పు సంప్రదాయానిదే గెలుపు
    మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దె దించే పద్ధతిని ఈసారీ పాటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఓటమి చవిచూడగా.. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే మా విధానం: సజ్జల
    సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్​ వేసిన పిటిషన్​ విచారణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీ వైసీపీ అని.. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే వైసీపీ విధానమని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దువ్వాడలో రైలు, ప్లాట్​ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థిని మృతి
    అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా ఫ్లాట్​ మధ్యలో ఇరుకున్న ఎంసీఏ విద్యార్థిని మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కడప స్టీల్​ ప్లాంట్​ కోసం.. అనుమతివ్వకపోయినా పాదయాత్ర చేస్తాం: సీపీఐ
    కడప ఉక్కు పరిశ్రమ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపటి నుంచి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించలేదు. అయినప్పటికీ జమ్మలమడుగు వద్ద సీఎం జగన్ వేసిన శిలాఫలకం నుంచి రామకృష్ణ పాదయాత్ర యథావిధిగా ప్రారంభమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తుఫానుగా మారిన వాయుగుండం.. ‘మాండూస్’గా నామకరణం...
    ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడిందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్​కు ‘మాండూస్’గా నామకరణం చేశారు. తుపాను ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు - ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుజరాత్​లో 'భాజపా' ప్రభంజనం.. హిమాచల్​లో 'హస్తం పార్టీ'దే హవా
    ఐదేళ్ల కోసారి అధికారం మార్చే ఆచారం హిమాచల్​ ప్రదేశ్​లో ఈసారీ కొనసాగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కమలం పార్టీ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్​ పార్టీ జాక్​పాట్​ కొట్టేసింది. మేజిక్​ ఫిగర్​ దాటి 36 సీట్లలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు అవసరం కాగా.. కాంగ్రెస్ సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? పెరిగిన EMI చెల్లించాల్సిందేనా?
    ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం వల్ల మరోసారి హోం లోన్స్ ప్రియం కానున్నాయి. అయితే, మునుపటిలా కాలవ్యవధిని కాకుండా ఈఎంఐ మొత్తాన్ని పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఈఎంఐ ఎంత పెరిగింది? పెరిగిన ఈఎంఐ చెల్లించాల్సిందేనా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పంత్​-శాంసన్​ వివాదం.. బీసీసీఐ-టీమ్ ​మేనేజ్​మెంట్​ మధ్య అసలేం జరుగుతోంది?
    పంత్​-సంజూశాంసన్​ వివాదం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Chiranjeevi: ఫ్యామిలీతో విహార యాత్ర.. శ్రుతిహాసన్​తో వీరయ్య యాత్ర
    వాల్తేరు వీరయ్య షూటింగ్​లో భాగంగా యూరప్​ వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడ దిగిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసేయండి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.