ETV Bharat / state

భర్త చేతిలో భార్య దారుణ హత్య

author img

By

Published : Feb 15, 2020, 8:21 PM IST

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/15-February-2020/6082929_592_6082929_1581776927228.png
మహిళ మృతదేహం

విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య నెలకొన్న గొడవలో విచక్షణ కోల్పోయిన భర్త.. భార్యను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విశాఖపట్నం జిల్లాలో భర్త చేతిలో భార్య దారుణ హత్య

కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, సరోజినీలు భార్యాభర్తలు. కొంత కాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో శ్రీనివాసరావు ఆవేశంతో భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్​టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి.తాగుడుకు బానిసయ్యాడని కన్నబిడ్డపై కత్తితో తల్లి దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.