ETV Bharat / state

ఎస్ఈసీకి ఉత్తరాంధ్ర తెలుగుశక్తి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు

author img

By

Published : Jan 30, 2021, 5:09 PM IST

జీవీఎంసీ అధికారులు చేసిన వార్డుల విభజన, రిజర్వేషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర తెలుగుశక్తి సంస్థ ప్రతినిధులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

Uttarandhara Telugu Sakthi  Representatives Complaint to SEC
ఎస్ఈసీకి ఉత్తరాంధ్ర తెలుగుశక్తి సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు


విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నిమిత్తం గతేడాది జీవీఎంసీ అధికారులు చేసిన వార్డుల విభజన... అభ్యర్థుల రిజర్వేషన్లు అసంబద్ధంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర తెలుగు శక్తి సంస్థ ప్రతినిధులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు.. లోపభూయిష్టంగా ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సరిచేయాలని కోరారు. ఈమేరకు ఎస్ఈసీ కార్యాలయ అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోలింగ్ తేదీల్లో సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.