ETV Bharat / state

కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సెల్యూట్

author img

By

Published : May 3, 2020, 10:23 AM IST

Updated : May 3, 2020, 1:00 PM IST

కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. విశాఖలో కరోనా నివారణకు పోరాడుతున్న వీరులకు రక్షణ దళాలు సంఘీభావం తెలుపుతూ.. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాయి.

కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సంఘీభావం
కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సంఘీభావం

విశాఖలో కరోనా యోధులకు రక్షణదళాలు సంఘీభావం ప్రకటించాయి. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బంది పై పూల వర్షం కురిపించారు. విశాఖలోని టీబీ, ఛాతీ ఆస్పత్రుల పై నౌకదళ హెలికాప్టర్లు పూలు చల్లాయి. ఈ సందర్భంగా విశాఖలోని వైద్య సిబ్బందిని నౌకదళ అధికారులు సన్మానించారు.

విశాఖలో నిలిపి ఉంచిన నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7.30 గంటల నుంచి 11.59 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముంబయి, విశాఖ, చెన్నై, కొచ్చిలోని నౌకలకు దీపాలంకరణ చేస్తారు.

ఇవీ చదవండి..కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

Last Updated :May 3, 2020, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.