ETV Bharat / state

'అఖండ భారతావనిని ఏకం చేసిన అపర చాణక్యుడు'

author img

By

Published : Oct 31, 2020, 11:21 PM IST

విశాఖ భాజపా కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అఖండ భారతావనిని ఏకం చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. చాణక్య నీతితో చిరస్థాయిగా గుర్తిండి పోతారంటూ.. నివాళులర్పించారు.

patel jayanti in visakha bjp office
విశాఖ భాజపా కార్యాలయంలో పటేల్ జయంతి వేడుకలు

562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్​దని.. భాజపా విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కొనియాడారు. భాజపా కార్యాలయంలో పటేల్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చాణక్య నీతితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉక్కుమనిషి అని ప్రశంసించారు. వాల్తేరు క్లబ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద పలువురు నేతలు నివాళులర్పించారు.

ఇదీ చదవండి: ఏఐటీయూసీ శతదినోత్సవ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.