ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి వసూళ్ళపై.. రవాణాశాఖ అధికారుల కొరడా..!

author img

By

Published : Jan 13, 2023, 12:29 PM IST

private travells
private travells ()

పండుగ వేళ ప్రయాణికుల రద్దీ పెరిగింది. రహదారులపై వాహనాల సంఖ్య అంచనాలు మించిపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే కార్లు టోల్ ప్లాజాల వద్ద బారులుదీరి కనిపిస్తున్నాయి. మరో వైపు సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. దీనిని అవకాశంగా మలుచుకుని ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. అధిక చార్జీలు వసూలు చేస్తూ జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.

సంక్రాంతి పండుగ వేళ ఇష్టారాజ్యంగా ప్రయాణికులను దండుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించి జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగే ప్రైవేటు బస్సులపై కొరఢా ఝళిపిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా గురువారం ఒక్కరోజు చేపట్టిన తనిఖీల్లో 87 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు.

rta checking
rta checking

విశాఖ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో నిన్న ఒక్కరోజే 16 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణాశాఖ అధికారి జీసీ రాజారత్నం తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 87బస్సులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 3బస్సులను సీజ్ చేశామని, అపరాధ రుసుంగా రూ.4.09లక్షలు వసూలు చేశామని వివరించారు. పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించి తగుచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 17వరకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.