ETV Bharat / state

ఎన్టీఆర్ ఆస్పత్రికి రాంకో సిమెంట్ రూ.20 లక్షల విరాళం

author img

By

Published : May 12, 2021, 7:25 PM IST

funds donated
funds donated

విశాఖలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి.. రాంకో సిమెంట్ యాజమాన్యం రూ.20 లక్షలు విరాళం అందజేసింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ పడకలను పెంచి రోగులకు వైద్యసేవలు అందించాలని యాజమాన్యం ఈ సందర్భంగా కోరింది. ఎమ్మెల్యే అమర్నాథ్ ఆధ్వర్యంలో.. రూ.20 లక్షల చెక్కును ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్​కు అందజేశారు.

కరోనా సమయంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ పడకలను పెంచి రోగులకు వైద్యసేవలు అందించాలని.. రాంకో సిమెంట్ కర్మాగారం యాజమాన్యం రూ.20 లక్షల విరాళాన్ని అందించింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో.. చెక్కును ఎన్టీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్​కు అందజేశారు.

కరోనా రోగులకు సాయం అందించడానికి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రాంకో సిమెంట్ యాజమాన్యం రూ.20 లక్షల నిధులను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చెప్పారు. లారెస్ కంపెనీ సైతం రూ.5 లక్షలు విరాళం ఇచ్చిందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో.. వైద్య సిబ్బంది పనితీరుపై కొందరు ఆరోపణలు చేయటం తగదని చెప్పారు.

ఇదీ చదవండి:

కొవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్ సహా కుటుంబ సభ్యులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.