ETV Bharat / state

యువకుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన

author img

By

Published : Aug 11, 2020, 6:51 PM IST

parents agitaion with dead body infront of narsipatanam police station
parents agitaion with dead body infront of narsipatanam police station

విశాఖ జిల్లా నర్సీపట్నం పీఎస్‌ ఎదుట ఎస్సీ యువకుడు గార కిశోర్‌ తల్లిదండ్రుల నిరసన తెలిపారు. కిశోర్‌ మృతికి కారకులను అరెస్టు చేయాలంటూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.

నిన్న సాయంత్రం నర్సీపట్నం పెద్దచెరువులో కిశోర్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 4 నుంచి కనిపించట్లేదని 7న పోలీసులకు కిశోర్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని.. స్థానిక పోలీస్ క్వార్టర్స్​లో ఉంటున్న యువతితో ప్రేమించి.. తమ వాడు బలయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని.. పోలీస్ట్ స్టేషన్ ఎదుట కిశోర్ మృతదేహంతో బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు.

ఇదీ చదవండి: యువకుడిని చెరువులో చంపి పడేసింది.. ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.