ETV Bharat / jagte-raho

యువకుడిని చెరువులో చంపి పడేసింది.. ఎవరు?

author img

By

Published : Aug 11, 2020, 5:51 PM IST

murder in vishaka district narsipatnam
murder in vishaka district narsipatnam

ఓ యువకుడు.. కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కొడుకు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకస్మాత్తుగా యువకుడు శవమై తేలాడు. ఇంతకీ ఆ యువకుడి మరణానికి కారణం.. ప్రేమా? ఇంకేదైనా?

విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన గార కిశోర్ హత్య సంచలనం రేపింది. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన కిశోర్ పట్టణ సమీపంలోని పెద్దచెరువులో శవమై తేలాడు. ఆగస్టు నాలుగో తేదీన కిశోర్ అదృశ్యమయ్యాడు. ఏడో తేదీన తల్లిదండ్రులు నర్సీపట్నం పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 10వ తేదీన స్థానిక పెద్ద చెరువులో పోలీసులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన కిశోర్ మృతదేహంగా గుర్తించారు. అసలు కిశోర్​ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆరా తీయగా.. కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.

కిశోర్ తల్లిదండ్రులు రోజువారి కూలీలు. పదో తరగతి వరకూ చదువుకొని కిశోర్ ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక పోలీస్ క్వార్టర్స్​లో ఉంటున్న యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. యువతి బంధువులే కిశోర్​ను హతమార్చి.. చెరువులో పడేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉదయం నర్సీపట్నం పోలీస్​ స్టేషన్ ఎదుట బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కిశోర్ ప్రేమించిన యువతితోపాటు ఆమె తల్లి సహా మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.