ETV Bharat / state

కొవిడ్ నిబంధనలు మరిచారు.. కిట్లను నిర్లక్ష్యంగా వదిలేశారు!

author img

By

Published : Feb 12, 2021, 1:56 PM IST

విశాఖ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో అధికారులు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించకుండా విధుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఇచ్చిన పీపీఈ కిట్లను మూలనపడేశారు.

no corona measures during panchayth election polling at vishaka district
no corona measures during panchayth election polling at vishaka district

కరోనా వేళ ఎన్నికలు వద్దంటూ పోరాటానికి దిగిన ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల విధుల్లో నిబంధనలు పాటించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లాలో తొలి విడత పోలింగ్‌లో అధికారులు, సిబ్బంది ఎలాంటి కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు.

ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి పీపీఈ కిట్లు ఇస్తే.. వాటిని మూలన పడేశారు. కనీసం క్యూలో నిల్చున్న ఓటర్లకు సైతం శానిటైజర్ ఇవ్వలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించటంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ పీపీఈ కిట్లు వేసుకోలేదు. కనీసం రెండో విడత ఎన్నికల్లో అయినా.. కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఓటర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం అంగీకారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.