ETV Bharat / state

కార్పొరేట్​కు దీటుగా ప్రభుత్వ బడులు : మంత్రి అవంతి శ్రీనివాసరావు

author img

By

Published : Oct 9, 2020, 10:33 PM IST

మంత్రి అవంతి శ్రీనివాసరావు
మంత్రి అవంతి శ్రీనివాసరావు

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విశాఖ జిల్లా గిడిజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్లు అందజేశారు.

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందజేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

జిల్లాలో సమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందజేస్తామని తెలిపారు. నాడు-నేడు పనులు కరోనా వల్ల సకాలంలో పూర్తికాలేదని మంత్రి అన్నారు. నవంబర్ నెలాఖరుకు జిల్లాలోని 1200 పాఠశాలలో నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

ఇదీ చదవండి:

రెండ్రోజులపాటు​ ప్రచారక్ బైఠక్...నూతక్కి చేరుకున్న మోహన్​ భగవత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.