ETV Bharat / state

ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారత నౌకాదళం చర్యలు

author img

By

Published : May 5, 2021, 7:37 PM IST

Indian Navy measures to overcome oxygen shortage in india
భారత నౌకాదళం

దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారత నౌకాదళం చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి ఆక్సిజన్ తీసుకువస్తున్నట్లు తెలిపింది.

భారత నౌకాదళ చర్యలు

దేశ నౌకాద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ త‌ల్వార్... 54 ట‌న్నుల లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజన్​తో భార‌త తీరానికి చేరుకున్నట్లు నేవీ ఉన్నతాధికారులు వెల్లడించారు. బహ్రెయిన్ నుంచి మంగుళూరు పోర్ట్​కు ఈ మెడిక‌ల్ ఆక్సిజన్ చేరుకున్నట్లు తెలిపింది. మ‌రో నౌక ఐఎన్ఎస్ ఐరావ‌త్ సింగ‌పూర్ నుంచి 3,600 ఆక్సిజన్ సిలిండ‌ర్లు, 27ట‌న్నుల సామ‌ర్ద్యం ఉన్న ఎనిమిది ఆక్సిజన్ ట్యాంకులు తీసుకువ‌స్తున్నట్లు నౌకాదళం పేర్కొంది.

ఇదీ చదవండి:

'వెంటిలేటర్లు లేక నలుగురు చనిపోయారు.. అధికారులూ పట్టించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.