విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం గ్రామంలో దంపతుల మధ్య కలహల కారణంగా.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన కాటపల్లి రవి (25) పెయింటింగ్ పనులు చేస్తుండేవాడు. నాలుగేళ్ల క్రితం సంతోషి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి యశ్వంత్, సంపత్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. కొద్ది రోజులుగా భార్యాభర్తలు మధ్య తరచు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.
శ్మశాన వాటికకు సమీపంలోని చెట్టుకు రవి ఉరి వేసుకుని ఉండడాన్ని.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జయ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతోనే రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు.. ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
ఇదీ చదవండి:
నకిలీ స్టిక్కర్లు అంటించి కాలం చెల్లిన మందుల పంపిణీపై నేడు విచారణ