ETV Bharat / state

Ganja Seized: విశాఖ ఏజెన్సీలో రూ.రెండున్నర కోట్ల గంజాయి స్వాధీనం

author img

By

Published : Aug 30, 2021, 4:19 PM IST

విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి రవాణా చేస్తున్న 2,690 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. రెండున్న‌ర కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి, మూడు వాహనాలను సీజ్‌ చేశారు.

రూ.రెండున్నర కోట్ల గంజాయి స్వాధీనం
రూ.రెండున్నర కోట్ల గంజాయి స్వాధీనం

విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం చీడిపాలెం, బూదరాళ్ల జంక్షన్ల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 2,690 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చీడిపాలెం జంక్షన్‌ వద్ద ఐషర్ వాహనంలో తరలిస్తున్న 1,710 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని వ్యాన్ డ్రైవర్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. బూదరాళ్ల జంక్షన్‌ వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 980 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని డ్రైవర్ శరకణం రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

కాగా..వ్యాన్‌ ముందు ద్విచక్రవాహనంపై ఫైలట్‌గా వస్తున్న ఓ వ్యక్తి వాహనాన్ని వదిలి పరారైనట్లు ఎస్సై నాగేంద్ర చెప్పారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతని ఆచూకీ కూడా తెలుసుకుంటామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.15,200 నగదు, వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ బ‌హిరంగ మార్కెట్‌లో రూ. రెండున్న‌ర కోట్లకుపైగా ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు.

ఇదీ చదవండి

Tollywood Drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపట్నుంచి ఈడీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.