ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలనుకున్న విశాఖ బే-పార్క్ పర్యాటక ప్రాజెక్టుకు 526 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. 37 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు సంస్థలతో కలసి అభివృద్ధి చేయాలన్న నిర్ణయానికి ఇదివరకే మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే.. సాగరతీరంలో ఎక్కువ ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఇరవై ఎనిమిది ఎకరాల స్థలంలో హోటళ్లు, ఇతర పర్యాటక ఆకర్షణలు నెలకొల్పనున్నారు.
స్కైటవర్, టన్నెల్ అక్వేరియం, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ ప్రాజెక్టులకు చోటు కల్పిస్తారు. ప్రస్తుతం ఇక్కడ రిజిస్ట్రేషన్ విలువ గజానికి 29 వేల రూపాయలుగా ఉంది. ఇక్కడ దామాషా పద్ధతిలో పెట్టుబడులు ఆహ్వానించటం ద్వారా పర్యాటకం ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: