విశాఖ జిల్లా ఎలమంచిలిలో గుడ్ ఫ్రైడే వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి నిర్వాహకులు ఏసుక్రీస్తుకు శిలువ వేసి ప్రదర్శించిన ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. ఏసుక్రీస్తుకి శిలువ వేయడం, చిత్రహింసలకు గురి చేయడం, ముళ్ల కిరీటం పెట్టడం లాంటి ఘట్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. మహిళలు సిలువలను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, మహిళలు ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఇదీ చదవండి