ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: మూతపడిన అనకాపల్లి బెల్లం మార్కెట్

author img

By

Published : Jun 9, 2020, 12:53 PM IST

due to corona Anakapalli jaggery market was Closed in visakhapatnam district
due to corona Anakapalli jaggery market was Closed in visakhapatnam district

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్లో బెల్లం అమ్మకాలు నిలిపేస్తున్నట్టు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు. మార్కెట్​కి వచ్చే వర్తకులు, కార్మికులు కంటైన్​మెంట్ జోన్​లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం ప్రాంతంలో కరోనా కేసుల కారణంగా... ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. మార్కెట్​లోని వర్తకులు, కార్మికులు... 80 శాతం మంది అక్కడి నుంచే యార్డుకి వస్తుంటారు. దీంతో బెల్లం మార్కెట్​లోని అమ్మకాలు నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. సడలింపులు వచ్చాక తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వలసకూలీల అంశంపై సుప్రీం కీలకతీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.