ETV Bharat / state

విశాఖ రైల్వేస్టేషన్​లో అయ్యప్ప భక్తుల ఆందోళన.. ఏమైంది..?

author img

By

Published : Dec 15, 2022, 3:17 PM IST

Updated : Dec 15, 2022, 3:48 PM IST

Dharna of Ayyappa devotees: విశాఖ రైల్వేస్టేషన్​లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. విశాఖ-కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో 3 బోగీలు లేవంటూ నిరసన తెలిపారు. రిజర్వేషన్ బోగీలు పెట్టకుంటే.. తాము ఎలా ప్రయాణం చేయాలంటూ వారు నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ విశాఖ-కొల్లం ఎక్స్‌ప్రెస్‌ ముందు కూర్చుని ధర్నా చేశారు.

Dharna of Ayyappa devotees
Dharna of Ayyappa devotees

Ayyappa Devotees Agitation in Visakha: విశాఖ రైల్వే స్టేషన్​లో అయ్యప్ప స్వామి భక్తులు పట్టాలపై నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నుంచి కొల్లం వెళ్లే ఎక్స్​ప్రెస్​లో ఎస్‌ 8, 9, 10 బోగీలు కనిపించకపోవడంతో.. రిజర్వేషన్ చేయించుకున్న అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప శరణుఘోషతో ఎనిమిదో నెంబర్ ప్లాట్​ఫారం ప్రతిధ్వనించింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఉదయం బయలుదేరాల్సిన రైలు భక్తుల ఆందోళనలతో నిలిచిపోయింది. తమకు బోగీలు ఏర్పాటు చేసేదాకా.. రైలు కదలనివ్వమని అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

విశాఖ రైల్వేస్టేషన్​లో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.