ETV Bharat / state

విశాఖ మన్యంలో వాలంటీర్లకు సత్కారం.. సేవలను కొనియాడిన నేతలు

author img

By

Published : Apr 21, 2021, 8:18 PM IST

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లి మ‌న్యంలోని అయిదు మండ‌లాల‌కు చెందిన వాలంటీర్ల‌కు ఉగాది పుర‌స్కారాలు అంద‌జేశారు. పాడేరు ఆర్డీవో ల‌క్ష్మీశివ‌జ్యోతి అధ్య‌క్ష‌తన నిర్వహించిన ఈ కార్యక్రమానికి అర‌కు ఎంపీ జి.మాధ‌వి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్య‌లక్ష్మిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

honor to volunteers
మన్యంలో వాలంటీర్లకు సత్కారం

విశాఖ మన్యం పాడేరులోని ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల క్రీడామైదానంలో వాలంటీర్లకు సత్కార సభ నిర్వహించారు. ఐదు మండ‌లాల నుంచి వా‌లంటీర్లు హాజ‌ర‌య్యారు. పాడేరు ఆర్డీవో ల‌క్ష్మీశివ‌జ్యోతి అధ్య‌క్ష‌తన నిర్వహించిన ఈ కార్యక్రమానికి అర‌కు ఎంపీ జి. మాధ‌వి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్య‌లక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని.. వాలంటీర్లకు అవార్డులు అందజేశారు.

గ‌తంలో పాడేరు ఐటీడీఏ పీవోగా ప‌ని చేయ‌డం వ‌ల్ల మ‌న్యంలో ప‌రిస్థితులు త‌న‌కు బాగా తెలుసున‌ని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. మైదాన ప్రాంతాల‌తో పోల్చి చూస్తే.. మ‌న్యంలో ర‌హ‌దారి, ర‌వాణా స‌మాచార వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా లేక‌పోయినా వాలంటీర్లు త‌మ విధులను చిత్త‌శుద్దితో అమ‌లు చేయ‌డం మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంద‌న్నారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ వాలంటీర్లు సేవాభావంతో నిరంత‌రం సేవ‌లందించార‌ని అరకు ఎంపీ మాధవి కొనియాడారు. క‌రోనా రెండో విడ‌త ఉగ్ర‌రూపం దాల్చుతున్న త‌రుణంలోనూ వీరి సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత అవ‌స‌రం అవుతాయ‌న్నారు.

వాలంటీర్లు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతూ.. మా వాలంటీర్లు అనిపించుకుంటూ మ‌మ‌కారాన్ని పొందుతున్నార‌ని పాడేరు ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో జేసీ -2 అరుణ్‌బాబు, పీవో వెంక‌టేశ్వ‌ర్‌, చింత‌ప‌ల్లి ఏఎస్‌పీ విద్యాసాగ‌ర‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

ఇళ్ల స్థలాలకు 3.79 లక్షల కుటుంబాల ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.