ETV Bharat / state

Causeway: నిండిన రైవాడ జలాశయం.. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన శారదానదిపై కాజ్‌వే

author img

By

Published : Oct 5, 2021, 12:43 PM IST

గులాబ్ తుపాను ధాటికి.. విశాఖ జిల్లాలోని రైవాడ జలాశయం పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. చోడవరం మండలం గవరవరం వద్ద ఉన్న శారదానదిపైన.. కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

causeway damaged at chodavaram in vishaka
నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన శారదానదిపై కాజ్‌వే


గులాబ్ తుపాను ప్రభావంతో.. విశాఖ జిల్లాలోని రైవాడ జలాశయం పూర్తిగా నిండింది. జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయటంతో.. చోడవరం మండలం గవరవరం వద్ద శారదానదిపైన కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోయింది. చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శారదా నదిపై వంతెన 2012లో కూలింది. దీంతో రాకపోకల సాగించేందుకు.. నదిపై తాత్కాలిక కాజ్​వేను నిర్మించారు. ఇప్పటికీ ఈ కాజువే నాలుగు దఫాలుగా కొట్టుకుపోగా.. ఇలా జరగటం ఇది ఐదవ సారి అని గ్రామస్థులు తెలిపారు.


ఇదీ చదవండి:

swecha program: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.