ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Dec 15, 2022, 10:59 AM IST

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

..

  • గ్రీన్‌కో సంస్థ పరిహారానికి.. ప్రేతాత్మలు పుట్టుకొచ్చాయ్..
    నంద్యాల జిల్లాలో ఓ ప్రాజెక్టు పరిహారాన్ని..ప్రేతాత్మలు మింగేశాయి. మృతి చెందినవారి పేర్లు రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేసి..చేర్పించారు. ఆ తర్వాత ఎంచక్కా వారసుల పేరుతో దర్జాగా పరిహారం బుక్కేశారు. విషయం బయటకు రావడంతో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఐతే దందాలో కీలకమైన వారిని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎంపీ కేశినేని నాని కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు దంపతులు
    టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ మహోత్సవానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నూతన కార్యవర్గ ఎన్నిక ఎందుకు జరపడం లేదు.. బార్​ అసోసియేషన్​పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
    ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘంపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. నూతన కార్యవర్గ ఎన్నికను ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రస్తుత కార్యవర్గాన్ని ప్రశ్నించింది. మెమో చూస్తుంటే ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మైనింగ్ లక్ష్యాలపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
    రాష్ట్రంలో ఆదాయ లక్ష్యానికి అనుగుణంగా మైనింగ్ రెవెన్యూను సాధించాలని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఏపీలో ఉన్న అపారమైన ఖనిజవనరుల్ని వెలికి తీసి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పరిశ్రమలకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రాన్స్​జెండర్ సంకల్పం.. కుటుంబం దూరమైనా.. రాష్ట్రంలోనే తొలి లాయర్​గా.
    ట్రాన్స్​జెండర్స్ అంటేనే అందరూ భిన్నాభిప్రాయంతో ఉంటారు. అలాంటిది ఒక ట్రాన్స్​జెండర్.. సమాజంలోని అడ్డంకులను ఎదురించి న్యాయవాదిగా మారారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతూ లాయర్ అయిన తొలి ట్రాన్స్​జెండర్​గా చరిత్ర సృష్టించారు. కుటుంబ సహకారం లేకపోయినా కష్టపడి చదువుకుని ఔరా అనిపించారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చాటి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'.. ఐరాస వేదికగా పాక్, చైనాలకు జైశంకర్ చురకలు
    ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే
    దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ
    స్టార్ బ్యాటర్​​ విరాట్‌ కోహ్లీ తాను తిన్న ఓ వంటకం రుచిని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఆ సంగతులను తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉర్రూతలూగిస్తున్న 'సుగుణ సుందరి' సాంగ్​.. బాలయ్య-శ్రుతి డ్యాన్స్​ అదరగొట్టేశారుగా
    నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి'లోని సుగుణ సందరి సాంగ్ రిలీజైంది. ఫ్యాన్స్​ను ఉర్రూతలూగిస్తోంది. ఇందులో బాలయ్య శ్రుతి స్టెప్పులు అదిరిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీనియర్​ నటికి రెండేళ్లు జైలు శిక్ష
    అన్న భార్యపై వరకట్న వేధింపులకు పాల్పడిన కేసులో సినీ నటి అభినయకు ఉన్నత న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.