ETV Bharat / state

విలేకరి పై కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్టు

author img

By

Published : Feb 14, 2023, 10:16 PM IST

అరెస్టు
అరెస్టు

Firing on Journalist: అన్నమయ్య జిల్లా కేంద్రంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఓ ఛానల్ విలేకరిపై కాల్పులు జరిగిన సంఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించిన వివరాలు ప్రకారం పీలేరులో ఓ ఛానల్ విలేకరిగా పని చేస్తున్న పర్వత రెడ్డిపై గత నెల 31వ తేదీ రాయచోటి పట్టణంలోని శివాలయం కూడలిలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు.

Firing on Journalist: అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ శ్రీధర్ విలేకరిపై కాల్పులు జరిగిన సంఘటనను పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఓ ఛానల్ విలేకరిపై కాల్పులు జరిగిన వివరాలు వెల్లడించారు. దీనిలో భగంగా డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం పీలేరులో ఓ ఛానల్ విలేకరిగా పని చేస్తున్న పర్వత రెడ్డిపై నెల 31వ తేదీ రాయచోటి పట్టణంలోని శివాలయం కూడలిలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే తీవ్రంగా గాయపడిన పర్వత రెడ్డి తనకు బస్సు టైర్ నుంచి జారీ వచ్చిన రాయి తగిలి గాయమైందని భావించి కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాలనుకున్నారు. అక్కడ వైద్యులు శరీరంలో బుల్లెట్ ఉందని స్కానింగ్ ద్వారా తేల్చడం తో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి ఎక్కడ బుల్లెట్ వెలికితీశారని అన్నారు.

దీంతో బాధితుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఐతే గోశాలను కలిగి ఉన్న పర్వత రెడ్డి ప్రొద్దుటూరు కడప ప్రాంతాల నుంచి ఆవులు గేదెలను అక్రమ రవాణా చేస్తున్న వారి వాహనాలను రోడ్లపై నిలిపి బెదిరింపులతో అక్రమ వసూల్లకు పాల్పడేవాడని డీఎస్పీ వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు చెందిన బీఫ్ వ్యాపారి మహమ్మద్ ఇలియాస్ నుంచి పర్వత రెడ్డి రూ 5 లక్షలు తీసుకొని అతని వాహనాలు ఎక్కడ నిలపకుండా చూసుకుంటానని చెప్పినట్లు డీఎస్పీ వ్యాఖ్యానించారు. అయితే కొంతకాలం తర్వాత మహమ్మద్ ఇలియాస్ తరలింపు రూట్ ను మార్చుకోవడంతో ముందుగా ఇచ్చిన ఐదు లక్షలు తనకి ఇచ్చేయాలని పర్వత రెడ్డిలు కోరినట్లుగా చెప్పారు.

అందుకు పర్వత రెడ్డి అంగీకరించకుండా నీవు రూటు మార్చి పశువులను ఎలా అక్రమ రవాణా చేస్తావో చూస్తానని.. పోలీసులకు పట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతూ వచ్చారని అన్నారు. దీంతో ఎలాగైనా విలేకరి పర్వతరెడ్డిని హతమార్చాలని మహమ్మద్ ఇలియాస్ కుట్ర పన్నాడు.

కుట్రలో భాగంగా తన దుకాణంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా ఫలౌడా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇంతియాజ్ (22), షేక్ సుహేల్(22)తో రూ.2 లక్షలకు కిరాయి ఒప్పందం చేసుకొని రెండు రోజులుగా రాయచోటిలో మాటు వేసి పర్వత రెడ్డి కదలికలను గతనెల 30వ తేదీ రెక్కి నిర్వహించారన్నారు. 31వ తేదీ పర్వత రెడ్డి రింగ్ రోడ్డు నుంచి ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తుండగా శివాలయం కూడలిలో మాటువేసి అతనిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.

తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని చూసి నిందితులు పరారయ్యారని డీఎస్పీ పేర్కొన్నారు. 15 రోజులు పాటు కేసు దర్యాప్తు నంగా సోమవారం ప్రొద్దుటూరులోని ప్రథమ నిందితుడు షేక్ మహమ్మద్ ఇలియాస్ బీఫ్ వ్యాపార కేంద్రం వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే పర్వత రెడ్డి బెదిరింపులు భరించలేక నెలవారి మామూలు ఇవ్వలేకనే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో వెళ్లడైందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చేదించిన సీఐ సుధాకర్ రెడ్డిని, అతని బృందాన్ని డీఎస్పీ అభినందించారు.

విలేకరి పై కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.