శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం భోగా బేని గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురై తల్లి, కుమార్తె మృతిచెందారు. తల్లి లక్ష్మి, కుమార్తె శైలజను పాము కరిచినట్లు గుర్తించి సోంపేట సామాాజిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి శైలజ మార్గమధ్యలో మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి:
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి