ETV Bharat / state

పాముకాటుతో తల్లి, కుమార్తె మృతి

author img

By

Published : Sep 16, 2020, 7:57 AM IST

పాముకాటుతో తల్లి, కుమార్తె మృతి
పాముకాటుతో తల్లి, కుమార్తె మృతి

పాముకాటుకు గురై శ్రీకాకుళం జిల్లాలో తల్లి, కుమార్తె మరణించారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరిని పాము కరిచింది. గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం భోగా బేని గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురై తల్లి, కుమార్తె మృతిచెందారు. తల్లి లక్ష్మి, కుమార్తె శైలజను పాము కరిచినట్లు గుర్తించి సోంపేట సామాాజిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి శైలజ మార్గమధ్యలో మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.