ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

author img

By

Published : May 7, 2022, 9:02 PM IST

Updated : May 7, 2022, 10:03 PM IST

వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై మగ్గురు మృతి
వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై మగ్గురు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో వేర్వేరు చోట్ల ముగ్గురు మృతిచెందారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఆముదాలవలస మండలం నెల్లిపర్తికి చెందిన గరికిపాటి ఏకశీ, పొదిలి లక్ష్మీ పిడుగుపాటుకు గురై మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడగా వారిని 108 అంబులెన్స్​లో సమీప ఆసుపత్రికి తరలించారు. బూర్జ మండలం పనుకుపర్తి గ్రామానికి చెందిన కొడ్రోత్ మేఘన (13) పిడుగుపాటుకు ప్రాణాలు విడిచింది. ఇదే గ్రామంలో మరో ఇద్దరు గాయపడగా..వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలో ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్లంపేట, మెలియాపుట్టి, టెక్కలి, సంతబొమ్మాలి, పొందూరు, కోటబొమ్మాలి, సారవకోట, జలుమూరు మండలాల్లో ఇవాళ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చూడండి :

మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. 79 రోజులు నరకం

Goa alcohol sieged: చీరాలలో చిక్కిన గోవా మద్యం..

కడుపులో ఉన్నప్పుడే నాన్న వదిలేసినా.. 'హీరోయిన్​'​ స్థాయికి ఎదిగి..

Last Updated :May 7, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.