ETV Bharat / state

బొబ్బిలి - పార్వతీపురం మధ్య రాకపోకలు బంద్

author img

By

Published : Apr 28, 2020, 6:00 PM IST

విజయనగరం జిల్లాలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన తాత్కాలిక రహదారికి గండి పడింది. అకాల వర్షాలకు రహదారి కోతకు గురైంది.

vijayanagaram district
బొబ్బిలి-పార్వతీపురం మధ్య రాకపోకలు బంద్

విజయనగరం జిల్లా సీతానగరంం మండల పరిధిలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన తాత్కాలిక రహదారికి గండి పడింది. నదిపై ఉన్న వంతెనకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు నెలల క్రితం తాత్కాలిక రహదారి నిర్మించారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి కోతకు గురైంది.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం నది మధ్య భాగంలో రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో 36వ రాష్ట్ర రహదారిపై నిత్యావసర సరకులు తరలించేందుకు, అత్యవసరంగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఆటకంకం ఏర్పడింది.

ఇదీ చదవండి:

గట్టుకు కోత.. జైకా నిధులు వస్తేనే పనులు చేస్తారట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.