ETV Bharat / state

దారుణం..కత్తి, గొడ్డలి కోసం తల్లిని చంపిన తనయుడు

author img

By

Published : Sep 6, 2020, 3:10 PM IST

తన తండ్రి కత్తి, గొడ్డలి కోసం ఓ తనయుడు తల్లిని దారుణంగా చంపాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని మెలచ్చురులో జరిగింది.

The son  killed the mother at melachhuru
తల్లిని చంపిన తనయుడు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని మెలచ్చురులో తన తండ్రి కత్తి, గొడ్డలి కోసం ఓ తనయుడు తల్లిని దారుణంగా చంపాడు. కాలనీకి చెందిన జయమ్మ(55).. భర్త 20 ఏళ్ల కిందట మృతి చెందడంతో... అదే గ్రామానికి చెందిన సిద్ధయ్యతో సహజీవనం సాగిస్తోంది. ఇందులో భాగంగానే తండ్రి సంపాదించిన కత్తి, గొడ్డలిని తనకు ఇవ్వాలని సిద్ధయ్య పెద్ద కుమారుడు కొండయ్య... జయమ్మతో వివాదానికి దిగాడు. ఆమె మీద దాడికి పాల్పడటంతో..జయమ్మ అక్కడిక్కడే మృతి చెందింది.

ఇదీ చూడండి. 'ఎడగారు' ధాన్య సేకరణ సమస్యకు మంత్రి మేకపాటి పరిష్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.