ETV Bharat / state

'లాక్ డౌన్​ ప్రకటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?'

author img

By

Published : Mar 23, 2020, 11:10 PM IST

ప్రభుత్వం ప్రతి ఇంటికి మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేయాలని తెదేపా నేత కూన రవికుమార్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

koona ravikumar
'కరోనా నియంత్రణపై ప్రభుత్వం వెనకంజ'

కరోనా వైరస్‌ నియంత్రణపై ప్రభుత్వం వెనకంజ వేస్తుందని తెదేపా నేత కూన రవికుమార్‌ విమర్శించారు. ఇప్పటికైనా మేధావులు, నిపుణుల సూచనల సలహాలతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ నెల 31వ వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించి.. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామనడం శోచనీయమన్నారు. క్రమశిక్షణ గల ప్రభుత్వంగా అన్ని చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

లాక్ డౌన్​ ప్రకటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?:కూన రవికుమార్

ఇవీ చూడండి-రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌: నోటిఫికేషన్ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.