ETV Bharat / state

Speaker Tammineni: 'మాది వాలంటీరు ప్రభుత్వం': స్పీకర్‌ తమ్మినేని

author img

By

Published : Apr 20, 2022, 7:52 AM IST

tammineni sitaram
వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

Speaker: కరోనా విపత్తు సమయంలో ఎనలేని సేవలందించిన ఘనత వాలంటీర్లదేనని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని కింతలిలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Speaker: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఓ వాలంటీరులా పని చేస్తున్నారని,.. తమది వాలంటీరు ప్రభుత్వమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తామంతా వాలంటీర్లమేనని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని కింతలిలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో స్పీకర్‌ పాల్గొని మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ఎనలేని సేవలందించిన ఘనత వాలంటీర్లదేనన్నారు. తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారిని గుర్తించి, అవార్డులు అందించడమంటే వారిని గౌరవించడమేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కొత్త జిల్లాలకు.. ఇన్‌ఛార్జి మంత్రులను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.