ETV Bharat / state

గుంపు నుంచి దారి తప్పిన ఏనుగు..భయాందోళనలో గిరిజనులు

author img

By

Published : Nov 15, 2020, 3:36 PM IST

గుంపు నుంచి దారి తప్పిన ఏనుగు
గుంపు నుంచి దారి తప్పిన ఏనుగు

విజయనగరం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి ఓ ఏనుగు దారి తప్పి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించడంతో ఆందోళన నెలకొంది. తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని గిరిజనులు భయపడుతున్నారు.

ఇటీవలే ఒక ఏనుగు విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తిని బలి తీసుకుంది. దీంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం మూలలంక వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగు ప్రస్తుతం సంచరిస్తోంది. ఏనుగు సంచారంతో ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు తమ గ్రామాలపైకి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. పాలకొండ అటవీశాఖ అధికారి సోమశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

గుంపు నుంచి దారి తప్పిన ఏనుగు
గుంపు నుంచి దారి తప్పిన ఏనుగు

ఇదీ చదవండి: క్లీనర్‌ను దారుణంగా చంపి... లారీలో పోలీస్​ స్టేషన్​కి మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.