ఇటీవలే ఒక ఏనుగు విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తిని బలి తీసుకుంది. దీంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం మూలలంక వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగు ప్రస్తుతం సంచరిస్తోంది. ఏనుగు సంచారంతో ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు తమ గ్రామాలపైకి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. పాలకొండ అటవీశాఖ అధికారి సోమశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి: క్లీనర్ను దారుణంగా చంపి... లారీలో పోలీస్ స్టేషన్కి మృతదేహాన్ని తీసుకొచ్చిన డ్రైవర్