ETV Bharat / state

వంశధార నది నుంచి ఇసుక తరలింపు.. అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

author img

By

Published : Jun 1, 2020, 12:16 PM IST

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం వంశధార నది నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండగా రెవెన్యూ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసి.... 19 లారీలను స్వాధీనం చేసుకున్నారు.

revenue officers seized lorrys at vamsadhara river in bhamini
వంశధార నది వద్ద రెవెన్యూ అధికారుల దాడులు

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం వంశధార నది వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసులు, దాడులు నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో... తనిఖీలు చేశారు. ఈ దాడులలో 19 లారీలను అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఈ నది ఉంది. రెండు భూభాాగాలలో ఎక్కడా తవ్వకాలు జరిపారో.. రెవెన్యూ అధికారులు గుర్తించిన తర్వాత.. వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి. వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.