ETV Bharat / state

పురుషోత్తపురం చెక్​పోస్ట్ వద్ద ఆరో రోజు లారీ డ్రైవర్ల ఆందోళన

author img

By

Published : Nov 13, 2020, 3:12 PM IST

ఆంధ్రా సరిహద్దు ప్రాంతం జాతీయ రహదారిపై అడ్డుకున్న ధాన్యం లారీలు అడుగు కూడా ముందుకు కదలలేదు. దీంతో పురుషోత్తపురం తనిఖీ కేంద్రం వద్ద ఆరో రోజు వాహనచోదకులు ఆందోళన చేపట్టారు.

Lorry drivers protest At Purushottapuram
ఆరో రోజు లారీ డ్రైవర్లు ఆందోళన


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం చెక్​పోస్ట్ వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని జాతీయ రహదారిపై ధాన్యం లోడుతో వస్తున్న లారీలను అధికారులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆరు రోజులుగా అక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులు ఆందోళనకు దిగారు. మరోపక్క ఈ విషయమై స్థానిక అధికార యంత్రాంగం ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

ఇవీ చూడండి...

వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.