srikakulam: సుంకరపేట దాడి ఘటన బాధితులకు కూన రవికుమార్ పరామర్శ

author img

By

Published : Oct 10, 2021, 8:55 PM IST

Updated : Oct 10, 2021, 9:21 PM IST

కూన రవికుమార్​

బూర్జ మండలం సుంకరపేటలోని ఓ స్థల వివాద విషయంలో గాయపడిన బాధితులను తెదేపా నేత కూన రవికుమార్ పరామర్శించారు. ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరపేటలోని ఓ స్థల వివాదంలో గాయపడిన దళితులను తెదేపా నేత కూన రవికుమార్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దళితులపై వైకాపా నేతల దాడి అమానుషం అన్నారు. స్థల వివాదంలో వైకాపా నేతలు తమపై దాడికి పాల్పడ్డారని.. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఏళ్ల తరబడి నుంచి తాము సాగు చేసుకుంటున్న స్థలాన్ని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో అడ్డగించిన తమపై దాడికి దిగారని కన్నీరుమున్నీరయ్యారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని.. సాగు చేసుకుంటున్న భూమిని తిరిగి ఇప్పించేలా కృషి చేస్తామని కూన రవికుమార్ అన్నారు. అక్టోబరు 2న జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

clash between TDP and ycp: గ్రామసభలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

Last Updated :Oct 10, 2021, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.