ETV Bharat / state

'అపోహలు వద్దు... రైతులకు అందించే విద్యుత్​ ఉచితమే'

author img

By

Published : Sep 30, 2020, 9:00 AM IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనున్న వైయస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులు అపోహలు చెందవలసిన అవసరం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. రణస్థలం మండల కేంద్రంలో ఉచిత విద్యుత్​పై రైతులకు అవగాహన సదస్సు జరిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్​, స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.

free current awareness programme to farmers
అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్​, ఎమ్మెల్యే తదితరులు

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో ఉచిత విద్యుత్​పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనున్న వై.యస్.ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులు అపోహలు చెందవలసిన అవసరం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ అవుతుందన్నారు. వ్యవసాయ మోటార్లలకు విద్యుత్ మీటర్లు పెట్టడం వలన పారదర్శకమైన విద్యుత్ సరఫరా రైతులకు అందుతుందన్నారు. దీనివలన రైతులపై పైసా కూడా భారం పడదన్నారు.

జిల్లాలో ఉన్న 25,288 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్​ కనెక్షన్లు ఉన్నాయని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో 9638 కనెక్షన్లు ఉన్నాయని తెలియజేశారు. పథకానికి సంబంధించి రైతులు తమ బ్యాంకు ఖాతాలు ప్రారంభించవలసి ఉంటుందన్నారు.

రైతన్న సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్​కుమార్​ అన్నారు. అసత్యాలు, ఆరోపణలు నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉచిత కరెంట్​ బిల్లును జగనన్న ప్రభఫుత్వమే భరిస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

రైతుల ఉచిత విద్యుత్​కు ప్రభుత్వాల ఎసరు: వామపక్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.