ETV Bharat / state

ఎండల మలన్న సేవలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన

author img

By

Published : Nov 16, 2020, 1:00 PM IST

Deputy Chief Minister Dharmana
ఎండల మలన్న సేవలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు ఎండల మల్లికార్జున స్వామి శివక్షేత్రాన్ని దర్శించుకున్నారు. కార్తీకమాసంలో మొదటి సోమవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి శివక్షేత్రాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు దర్శించుకున్నారు. కార్తీకమాసంలో మొదటి సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పేరాడ తిలక్, ఇతర ముఖ్య నేతలు స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలతో మరింత సుపరిపాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయంలో వేకువ జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కొవిడ్ నిబంధనల మేరకు దేవాదాయశాఖ దర్శనానికి ఏర్పాట్లు చేసింది.

ఇవీ చూడండి...

మబగాంలో ముగిసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.