ETV Bharat / state

స్థల వివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

author img

By

Published : Mar 13, 2021, 10:35 AM IST

Conflict between
Conflict between

శ్రీకాకుళం జిల్లాలో ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.

ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో.. శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి.. కర్రలతో కొట్టుకున్నారు. ఓ స్థలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన సంవాదం ఘర్షణకు కారణమైంది.

ఓ కుటుంబానికి చెందిన వారు.. తమ ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... గాయపడిన వారిని.. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

తస్మాత్ జాగ్రత్త.. కరోనా భూతం పొంచే ఉంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.