ETV Bharat / state

పనస పండు కోసం చెట్టెక్కిన ఎలుగుబంటి

author img

By

Published : Jul 1, 2020, 7:32 AM IST

Updated : Jul 1, 2020, 12:27 PM IST

వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్​చల్
వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్​చల్

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంటి హల్​చల్ చేసింది. పొడవైన పనస చెట్టు ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్​చల్

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం జీడితోటలో ఎలుగుబంటి హల్​చల్ చేసింది. ఉద్దానం జీడి, కొబ్బరి తోటల పరిసరాల్లో నిత్యం ఎలుగుబంట్లు సంచరిస్తుండటం షరా మాములుగా మారాయి. అయితే అనకాపల్లి, ఒంకులూరు గ్రామాల మధ్య తోటల్లో పొడవైన పనస చెట్టు ఎక్కి అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే గాకుండా చెట్టుపైన ఉన్న కాయలను అందుకునే ప్రయత్నం చేసింది. ఇది తిలకించేందుకు కొంతమంది అక్కడికి చేరుకోవటంతో... ఎలుగుబంటి చెట్టు దిగి మెల్లగా జారుకుంది.

ఇదీ చదవండి: నాగావళి నదిపై నత్తనడకన వంతెన నిర్మాణం

Last Updated :Jul 1, 2020, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.