ETV Bharat / state

CONFLICTS: వైకాపాలో తారా స్థాయికి చేరిన వర్గ విభేదాలు..

author img

By

Published : May 26, 2022, 11:17 AM IST

CONFLICTS: హిందూపురం వైకాపా ఇంఛార్జి పదవిని స్థానికులకే అప్పజెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. వారం రోజులుగా నియోజకవర్గంలో మాజీ సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, ఆగ్రో సంస్థ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ రహస్య సమావేశాలు నిర్వహిస్తూ...అభిప్రాయాలు సేకరించారు.

CONFLICTS
వైకాపాలో తారా స్థాయికి చేరిన వర్గ విభేదాలు

CONFLICTS: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ వ్యవహారం కాస్త విజయవాడకు చేరింది. హిందూపురం వైకాపా ఇంఛార్జి పదవిని స్థానికులకే అప్పజెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. వారం రోజులుగా నియోజకవర్గంలో మాజీ సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, ఆగ్రో సంస్థ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ రహస్య సమావేశాలు నిర్వహిస్తూ...అభిప్రాయాలు సేకరించారు. బెంగళూరులోని ఓ రిసార్టులో... హిందూపురం మన్సిపల్‌లోని 14మంది కౌన్సిలర్లతో పాటు, మాజీ సమన్వయకర్తలు సమావేశమై 'వీ వాంట్ లోకల్' అన్న నినాదాన్ని అధిష్ఠానానికి తెలియజేయాలని తీర్మానించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు రాత్రి బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.