ETV Bharat / state

ఉరేసుకుని వివాహిత మృతి... లేఖ లభ్యం

author img

By

Published : Apr 10, 2021, 7:35 AM IST

ఫ్యాన్​కు ఉరేసుకుని వివాహిత మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

women suicede
మార్కాపురంలో వివాహిత మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మధుప్రియ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయం నుంచి ఎంతసేపటికీ ఇంట్లో నుంచి బయటకి రాకపోవడంపై.. ఎదురింటి వాళ్లు గమనించి సమీపంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. కిటికిలోనుంచి చూడగా ఫ్యాన్​కు ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఆమె భర్త శ్రీనివాస్ గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయం ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మృతదేహం వద్ద లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కారణం ఆ వీధి వాళ్లేనని.. తన జీవితాన్ని చేశారంటూ లేఖలో మధుప్రియ పేర్కొన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.