ETV Bharat / state

ఇంటిపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు.. కూలుస్తామని ప్రొక్లెయిన్ తెచ్చినా పట్టించుకోని పోలీసులు

author img

By

Published : Feb 27, 2023, 9:33 AM IST

ruling party attacks : అధికార పార్టీ నేతల దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా ప్రతిపక్ష నాయకులే కాదు.. నిరుపేదలు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు అక్రమార్కులకు అండగా నిలవడంతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఓ ఇంటి స్థలంపై కన్నేసిన నాయకులు.. నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ క్షణాన్నయినా కూల్చేస్తామని బెదిరిస్తూ.. ఇంటి పక్కనే ప్రొక్లెయిన్ తెచ్చి పెట్టారని బాధితుడు తెలిపాడు.

అధికార పార్టీ నేతల దాడులు
అధికార పార్టీ నేతల దాడులు

అధికార పార్టీ నేతల దాడులు

ruling party attacks : అధికార పార్టీ నేతల దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయి. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట ఈ భూ కబ్జాల పర్వం కొనసాగుతునే ఉంది. ఇలాంటి ఘటనే మరొకటి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్వీకేపీ కళాశాలల ఎదుట రహదారి పక్కన పట్టణానికి చెందిన కొందరు నిరు పేదలు దాదాపు 65 ఏళ్ల కిందట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరు విద్యుత్ బిల్లులతో పాటు పురపాలక సంఘానికి ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నారు.

స్థలాలు కబ్జా... ప్రస్తుతం భూముల ధరలు భారీగా పెరగడంతో ఆ పేదల ఇళ్లపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. కొందరిని బెదిరింపులకు గురి చేసి చిన్న మొత్తంలో నగదు ఇచ్చి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ మహమ్మద్ మన్సూర్ అనే వ్యక్తి తన స్థలాన్ని ఇవ్వబోనని తెగేసి చెప్పాడు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు రగిలిపోయారు. ఇవ్వకపోతే రాత్రికి రాత్రే ఇంటిని కూల్చేస్తామని తెగేసి చెప్పారు. దీంతో బాధితుల భయబ్రాంతులకు గురౌతున్నారు. ప్రతి రోజూ ఎవరో ఒకరు వచ్చి బెదిరిస్తున్నారని... చాలా అన్యాయమని వాపోయారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా... స్థానిక ఎస్సై శశికుమార్ కు పిర్యాదు చేసినా ఆ నాయకులకే పత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు వ్యక్తుల బారి నుంచి ఉన్నతాధికారులు తమకు రక్షణ కల్పించి తమ ఇంటిని కాపాడాలని మన్సూర్ కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నారు. తమకు మరో చోట ఉండేందుకు స్థలం కూడా లేదని ఇంట్లో మహిళలు బోరున విలపించారు. ఈ పరిస్థితిని గమనించిన చుట్టూ పక్కల వారు మరి ఇంత దౌర్జన్యామా..? అని అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నా తల్లిదండ్రులు 65 సంవత్సరాలుగా ఇక్కడే నివసించారు. మేం ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. రోజూ పండ్లు అమ్ముకుని జీవనం గడుపుతున్నాం. మాకు వేరే జీవనాధారం లేదు. చాలా రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఇంటి స్థలాన్ని అడుగుతున్నారు. రోజుకొకరు చొప్పున వచ్చి మా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తిడుతున్నారు. కొట్టేందుకు కూడా వచ్చారు. రాత్రికి రాత్రే ఇల్లు కూలుస్తామని ప్రొక్లెయిన్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టారు. భయం, భయంగా బతుకుతున్నాం. మమ్మల్ని ఎవ్వరూ కాపాడకపోతే కుటుంబం మొత్తం విషం తాగి చనిపోతాం. - షేక్ మహమ్మద్ మన్సూర్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.