ETV Bharat / state

Prathipati: "మహానాడు" ఏర్పాట్లను పరిశీలించిన.. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

author img

By

Published : May 23, 2022, 8:10 PM IST

Prathipati: ఒంగోలు సమీపంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఇతర తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు.

Prathipati: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. మండువారిపాలెం వద్ద దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చదునైన పొలాల్లో మహానాడు వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు.

ఇప్పటికే మహానాడు పనులు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున పందిళ్లు, రహదారులకు జంగిల్‌ క్లియరెన్స్​ వంటి పనులు చేపడుతున్నారు. మొత్తంగా మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.