ETV Bharat / state

అద్దె చెల్లించొద్దు.... వ్యాపారులకు పోలీసుల ఆదేశం...

author img

By

Published : Oct 30, 2019, 8:30 PM IST

రాయవరంలో రైల్వే వంతెన కింద ఉన్న దుకాణాలను ఆర్ అండ్ బీ అధికారులు,పోలీసులు పరిశీలించారు. దుకాణాలకు అద్దెలు చెల్లించొద్దని వ్యాపారులకు సూచించారు.

రైల్వే వంతెన కింద ఉన్నఅధికారులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో రైల్వే వంతెన కింద ఉన్న దుకాణాలను ఆర్ అండ్ బీ అధికారులు,పోలీసులు పరిశీలించారు. రైల్వే వంతెన కింద ఉన్న ప్రభుత్వ స్థలాల్లోని దుకాణాలకు అద్దెలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకట సైదులు తెలిపారు. కొంత మంది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి అద్దెలు వసూలు చేస్తుండడంతో ఫిర్యాదులు అందాయి. దీంతో ఆర్ అండ్ బి , రెవెన్యూ అధికాలు , పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని హమీ ఇచ్చారు. ఎవరైనా అద్దెలు వసూలు చేస్తే తమ దృష్టికి తేవాలన్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే దుకాణాలు ఖాళీ చేయిస్తామన్నారు.

రైల్వే వంతెన కింద ఉన్న దుకాణాలకు అద్దె చెల్లించొద్దు

ఇదీచూడండి.సరకుల కోసం వచ్చారు... నగదు, బంగారం దోచుకెళ్లారు

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.