ETV Bharat / state

ఆరోగ్య కార్యకర్తనని చెప్పి పసిపాపను ఎత్తుకెళ్లింది..!

author img

By

Published : Sep 30, 2020, 10:56 PM IST

తాను ఆరోగ్య కార్యకర్తనని చెప్పి ఓ మహిళ పసిపాపను ఎత్తుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. పాపను కోల్పోయిన తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

One Month Old Baby Girl Kidnapped in Darshi
ఆరోగ్య కార్యకర్తనని చెప్పి పసిపాపను ఎత్తుకెళ్లింది..!

ప్రకాశం జిల్లా దర్శిలో పసిపాప కిడ్నాప్​నకు గురైంది. దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మ నెల కిందట ఓ పసిపాపకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం మరియమ్మ వద్దకు ఓ మహిళ వచ్చి... తాను ఆరోగ్య కార్యకర్తను అని, మార్కాపురం నుంచి బదిలీపై వచ్చాను అని చెప్పింది. మీకు జగనన్న కానుక వస్తుందని, దర్శి వస్తే అక్కడ ఆన్​లైన్ చేయించి పంపుతామని నమ్మబలికింది. మరియమ్మతో పాటు మరో నలుగురికి చెప్పి వాళ్లని వెంటబెట్టుకొని దర్శికి చేరారు.

దర్శి వెళ్లిన తరువాత మరియమ్మతో పాటు వచ్చిన ముగ్గురిని వేరేచోట ఉంచి... మరియమ్మతో దర్శి సెంటర్లోని గడియారం స్తంభం వద్ద ఉన్న ఓ స్థూడియోని చూపించి ఫొటో దిగిరా.. పాపని చూసుకుంటానని చెప్పింది. మరియమ్మ తన పాపను ఆమెకిచ్చి ఫొటో దిగిరావటానికి వెళ్లింది. అదే అదునుగా ఆ మహిళ పాపను తీసుకొని వెళ్లిపోయింది. ఫొటో దిగి వచ్చిన మరియమ్మ... పాప, ఆ మహిళ కనపడకపోయేసరికి లబోదిబోమంటూ ఏడ్చింది. పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పింది.

సీఐ మహమ్మద్ మొయిన్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఎస్సైలు గాలింపు చర్యలు చేపట్టారు. ముండ్లమూరు ఎస్సై ఉల్లగల్లు వద్ద విచారించగా.. ఓ పసిపిల్లను ఎత్తుకొని ఓ మహిళ ఆటోలో వెళ్లిందని అని చెప్పగా.. ఎస్సై హుటాహుటిన తరలివెళ్లి గుంటూరు జిల్లా నూజిండ్ల మండలం ఉప్పలపాడు వద్ద ఆటోను ఆపి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 6,133 నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.