మార్కాపురంలో మంత్రి సురేశ్ పర్యటన చేశారు. బాలికల ఉన్నత పాఠాశాలలో ట్రిపుల్ ఐటీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. మంత్రితో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఉన్నారు.
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలపై అధికారులతో మంత్రి సురేశ్ చర్చించారు. మండలాల వారీగా పంటనష్టం వివరాలను తెలుసుకున్నారు. మార్కాపురం డివిజన్లో 80 శాతం పంట నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
ఇదీ చదవండి: సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?