ETV Bharat / state

NADENDLA MANOHAR: 'బద్వేల్‌లో భాజపా విజయం కోసం పని చేస్తాం'

author img

By

Published : Oct 9, 2021, 12:04 PM IST

Updated : Oct 9, 2021, 5:09 PM IST

janasena-pac-chairmen-nadendla-manohar-fires-on-ycp-government
'రహదారుల దుస్థితిపై సమాధానం చెప్పాలి'

రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రహదారుల కోసం ఇస్తామన్న నిధులను ఇప్పటికీ.. ఎందుకు కేటాయించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో భాజపా విజయం కోసం పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ప్రకాశం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రహదారుల దుస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రహదారుల కోసం ఇస్తామన్న నిధుల కేటాయింపులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువతకు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకు జనసేన ఎప్పుడూ సిద్ధమేనని.. సమస్యలపై నిజాయితీగా పోరాడే పార్టీ జనసేననే అని తెలిపారు. ప్రభుత్వం రైతులను ప్రణాళికాబద్ధంగా మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యలను ఇబ్బందులకు గురిచేస్తూ.. సభ ఏర్పాటు చేశారని నాదెండ్ల మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు రావాలంటూ గ్రామ వాలంటీర్లతో బెదిరించి మహిళలను సమావేశానికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వానంగా తయారైందని విమర్శించారు. బద్వేల్‌ ఉప ఎన్నికలో భాజపా విజయం కోసం పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ

Last Updated :Oct 9, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.